
న్యూఢిల్లీ: కిందటేడాది అంటే 2021లో దేశంలోని 4.5 కోట్ల మంది తమ ఫేవరెట్ రెస్టారెంట్లలో ఫుడ్ తిన్నారు. ఇలా తిన్నవారిలో ఎక్కువ మంది ఢిల్లీవాసులే ఉన్నారని ఒక రిపోర్టు వెల్లడించింది. ఫుడ్ తినడానికి రెస్టారెంట్లలో సగటున రూ. 2,670 బిల్లును చెల్లించినట్లు డైన్అవుట్ ఈ రిపోర్టులో తెలిపింది. అంతకు ముందు ఏడాది ఈ బిల్లు సగటున రూ. 1,907 గా ఉంది. తమ ద్వారా టేబుల్ బుక్ చేసుకోవడం వల్ల రూ. 1,360 కోట్లు ఆదా అయిందని ఈ రెస్టారెంట్ టెక్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. 2021లో మొత్తం 8,588 టేబుల్స్ బుక్ చేసినట్లు పేర్కొంది. వరసగా మూడోసారి ఢిల్లీనే డైనింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా నిలిచిందని, మొత్తం డైనర్లలో 32 శాతం మంది ఈ సిటీ వాళ్లేనని తెలిపింది. 18 శాతం డైనర్లతో బెంగళూరు సిటీ రెండో ప్లేస్లో నిలిచింది. బట్టర్ చికెన్, దాల్ మక్ని, నాన్లను 38 శాతం మంది ఇష్టపడ్డారని, చైనీస్ ఫుడ్ను 18 శాతం, కాంటినెంటల్ఫుడ్ను 16 శాతం మంది డైనర్లు కావాలనుకున్నారని డైన్ అవుట్తన రిపోర్టులో పేర్కొంది. ప్రజల ఆదాయాలు భారీగా పెరగడంతోపాటు, వర్క్ ఫ్రం హోమ్ లైఫ్ స్టైల్ వల్లా లగ్జరీ డైనింగ్ దేశంలో జోరందుకుందని, ఇది 120 శాతం పెరిగిందని, ఫైన్ డైనింగ్ 105 శాతం ఎక్కువైందని వివరించింది. డిసెంబర్ నెలలో 50 వేల లీటర్ల ఆల్కహాల్ వినియోగంతో బెంగళూరు 2021లో లిక్కర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నిలిచినట్లు పేర్కొంది. దేశంలోనే టాప్ ఈటింగ్ అవుట్ లొకేషన్గా ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ నిలవగా, ఆ తర్వాత ప్లేస్లో ముంబైలోని లోయర్ పరేల్, బెంగళూరులోని వైట్ఫీల్డ్లు నిలిచినట్లు డైన్అవుట్ ఈ రిపోర్టులో తెలిపింది. కరోనా వల్ల అంతకు ముందు ఏడాది పెద్దగా ఇల్లు కదలకపోవడంతో, 2021లో సగటు ఫుడ్బిల్లు ఏకంగా 40 శాతం పెరిగింది. డైన్ అవుట్ కో ఫౌండర్ అంకిత్ మెహ్రోత్రా చెప్పారు. తమ ద్వారా టేబుల్స్ బుక్ చేసుకోవడం వల్ల చాలా మంది డైనర్లకు డబ్బు ఆదా అయిందని పేర్కొన్నారు. 4 స్టార్ ప్లస్ రేటింగ్ ఉన్న రెస్టారెంట్లలోనే 73.5 శాతం ట్రాన్సాక్షన్లు జరిగాయని వివరించారు.