24 గంటలు.. 4,500 మరణాలు

24 గంటలు.. 4,500  మరణాలు
  • అమెరికాను వణికిస్తున్న కరోనా

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 24 గంటల్లో 4,491 మంది కరోనాకు బలయ్యారని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ రిపోర్ట్‌ ఇచ్చింది. దీంతో అమెరికాలో వైరస్‌ వల్ల చనిపోయినవారి సంఖ్య 34,562కి చేరింది. ఒకేరోజు ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి. తాజాగా ఇచ్చిన లెక్కల్లో కరోనా అనుమానిత మృతులను కూడా కలిపారు. న్యూయార్క్‌లో ఈ వారంలో 3,778 మంది కరోనా అనుమానిత మృతులు ఉన్నారని, వారిని కూడా కరోనా మృతులుగానే పరిగణిస్తామని అధికారులు చెప్పారు. ప్రపంచంలో వైరస్‌ బారిన పడిన వారు ఎక్కువగా చనిపోయింది అమెరికాలోనే . ఒక్క న్యూయార్క్‌లోనే 12వేల మంది చనిపోయారు. యూఎస్‌లో మొత్తం 6,67,800 మంది వైరస్‌ బారిన పడగా.. గత రెండ్రోజుల్లోనే రికార్డు స్థాయిలో చనిపోయారు. 19,130 మరణాలతో స్పెయిన్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 17,920 మరణాలతో ఫ్రాన్స్‌ మూడో ప్లేస్‌లో ఉంది.