ఏపీలో కొత్తగా 4,622 మందికి కరోనా పాజిటివ్,35 మృతి

ఏపీలో కొత్తగా 4,622 మందికి కరోనా పాజిటివ్,35 మృతి

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 72,082 శాంపిళ్లు పరీక్షించగా, 4,622 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో మరో 35 మంది చనిపోయారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 752 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 88 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రం మొత్తంగా ఏపీలో ఇప్పటివరకు 6,291 మంది కరోనాతో చనిపోగా… 5,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనాతో చిత్తూరులో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, కడపలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,291 కి చేరింది.