గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఒక లెక్చరర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా....43 మందికి పాజిటివ్ గా తేలింది.. మిగతా వారికి ఇవాళ కొవిడ్  పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పాజిటివ్  వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జీనోమ్  స్వీక్వెన్సింగ్ కు పంపారు. హాస్టల్ లోనే క్వారంటైన్ లో ఉంచి విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కొవిడ్  నిర్ధరణ అయింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్ గా తేలింది.