ముంబైలో ఘోర విషాదం.. లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్

ముంబైలో ఘోర విషాదం.. లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్

ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ఓవర్ క్రౌడ్ అవ్వటంతో స్లిప్ అయ్యి కొందరు ప్యాసెంజర్లు ట్రాక్ పైన పడిపోయారు . ఈ ప్రమాదంలో 5 మంది ప్రయాణికులు చనిపోయారు. ముంబై ఛత్రపతి శివాజీ టెర్నినస్ స్టేషన్ నుంచి థానే లోని కేసర ప్రాంతం వైపు వెళ్లుతన్న ట్రైన్ లో ఈ ఘటన జరిగింది. 

ట్రైన్ ఓవర్ క్రౌడ్ అవ్వటంతో 12 మంది ప్రయాణికులు కింద పడిపోయారని, అందులో ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కంపార్టుమెంట్లలో ప్రయాణికులు క్రిక్కిరిసి ఉండటంతో తోపులాట జరిగి డోర్ లో ఉన్న ప్యాసెంజర్స్ పడిపోయినట్లు వెల్లడించారు. 

ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో డోర్ కు వేలాడుతూ ప్రయాణం చేస్తుండగా ఒక్కసారిగా ట్రాక్ పై పడిపోయారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిలో కానిస్టేబుల్స్ కూడా ఉన్నట్లు సమచారం.