
‘‘పేరు, పెద్దరికం కోసం గత ప్రభుత్వ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే సర్కారు ఇంజనీర్లు ఎందుకు అడ్డుకోలేకపోయారు? కేసీఆర్ ఏం చదివిండని ఆయనకు అడ్డుచెప్పలేదు. మీరు చెప్పింది ఆయన వినకపోతే లీవ్ పెట్టుకొని వెళ్లిపోవాల్సింది” అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్ కింద మా భూములు కోల్పోయినం. మా బతుకుదెరువు పోయింది. అయినా ఈ ప్రాజెక్ట్ వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతున్నది. ఇప్పుడెవరిని అడగాలి? దీనికి సర్కారు ఇంజనీర్లే బాధ్యత వహించాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇన్ చీఫ్గా ఉన్న మీరు (ఈఎన్సీ మురళీధర్) ప్రభుత్వానికి తప్పుల గురించి వివరిస్తే బాగుండు. వాళ్లు వినకపోతే లీవ్ పెట్టుకొని పోతే ఇంత ప్రజాధనం దుర్వినియోగం కాకపోయేది” అని అన్నారు.