చెన్నై: తమిళనాడులో గురువారం నుంచి 500 వైన్షాపులు మూతపడనున్నాయి. చెన్నై సహా పలు సిటీలు, టౌన్లలో బడి, గుడి, కాలేజీలకు దగ్గర్లో ఉన్న లిక్కర్ షాపులను దశలవారీగా మూసివేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) బుధవారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31 నాటికి మొత్తం 5,329 రిటైల్ లిక్కర్షాపులు ఉండగా.. అందులో 500 దుకాణాలను మూసివేస్తామని ఏప్రిల్ 12న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది.
ఏప్రిల్ 20న సర్కారు జీవో జారీ చేసింది. ఆ జీవో ఆధారంగా గుర్తించిన 500 లిక్కర్ రిటైల్ అవుట్లెట్లు గురువారం నుంచి పనిచేయవని టాస్మాక్ ప్రకటించింది. ప్రతిపక్ష పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) దీనిని స్వాగతించింది. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం స్టాలిన్హామీ ఇచ్చారని, ఆ ప్రయాణానికి ఇది ప్రారంభం కావాలని పీఎంకే అధ్యక్షుడు, రాజ్యసభ
ఎంపీ అన్బుమణి రామదాస్ ట్వీట్ చేశారు.