దేశంలో 5 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో 5 వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో ఒక్కరోజే  8,380 మందికి పాజిటివ్​
ఇప్పటిదాకా ఇదే ఎక్కువ
మొత్తంగా 1,82,143 మంది కరోనా బాధితులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏ రోజుకారోజు రికార్డు సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,380 కరోనా కేసులు నమోదుకాగా..  ఒక్కరోజే ఇన్ని కేసులు నమోదుకావడం దేశంలో ఇదే ఫస్ట్ టైం. తాజా కేసులో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,82,143కి చేరింది. దీనిలో యాక్టివ్ కేసులు 89,995 కాగా 86,984 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లో 193 మరణాలు సంభవించగా.. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5, 164కి చేరిందని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..