
- ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థులు
- ఇప్పటి వరకు 5212 మంది స్టూడెంట్స్ జాయిన్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో బడిబాట ఫలితాలనిస్తోంది. మూతబడ్డ గవర్నమెంట్ స్కూళ్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. బడి బాట కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్సక్సెస్అయింది. గతేడాది జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లుగా రికార్డయిన 64 స్కూళ్లలో ఈ ఏడాది10 స్కూళ్లు రీ ఓపెన్అయ్యాయి. మరో కొత్త స్కూల్ను కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ఇప్పటివరకు180 విద్యార్థులు చేరారు. 2024లో జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లుగా నమోదయిన వాటిపై గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పెషల్ ఫోకస్పెట్టారు.
ఒకే గ్రామంలో రెండు పాఠశాలలున్న వాటిని ఆయా గ్రామాల్లో విద్యార్థులు లేని వాటిని పక్కనపెట్టారు. మిగిలినవి 22 స్కూళ్లపై దృష్టిసారించిన విద్యాశాఖ అధికారులు, వాటిలో స్టూడెంట్స్ జాయిన్ అయ్యేలా చూడడంలో సక్సెస్అయ్యారు. మళ్లీ ప్రారంభమైన స్కూళ్లలో కల్లూరు మండలంలో నాలుగు ఉండగా, ఏన్కూరు, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, పెనుబల్లి, కారేపల్లి, వైరా మండలాల్లో ఒక్కొక్క పాఠశాలలున్నాయి. ఇక రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్ లో కొత్తగా స్కూల్ ను ఏర్పాటు చేయగా, అక్కడ 40 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు.
కలెక్టర్స్పెషల్ ఇంట్రస్ట్..!
జిల్లా కలెక్టర్ గా ఏడాది పాటు పనిచేసిన ఐఏఎస్అధికారి ముజమ్మిల్ఖాన్గవర్నమెంట్ స్కూళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కల్లూరు మండలంలో మూడు జీరో ఎన్ రోల్ మెంట్ స్కూళ్లలో వసతుల కల్పన కోసం ప్రత్యేకంగా రూ.10 లక్షలు చెక్ ను కల్లూరు ఆర్డీవోకు అందజేశారు. ఈనెల 11న మూడు స్కూళ్ల పున: ప్రారంభాన్ని కూడా గ్రామంలో పండుగలాగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ ను, వారి పేరెంట్స్ను భాగస్వాములను చేశారు. దీంతో పాటు జిల్లాలోని పాఠశాలల్లో 'వియ్ కెన్ లెర్న్' పేరుతో స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్తరగతులను ఏర్పాటుచేశారు.
ఆయన చొరవతో పాటు విద్యాశాఖ అధికారులు గవర్నమెంట్ స్కూళ్లలో సౌకర్యాల గురించి ఇంటింటి ప్రచారం చేయడంతో బడిబాటలో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది ఒకరే విద్యార్థిని ఉన్న వైరా మండలం నారపునేనిపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 13కి పెరిగింది. అక్కడ స్కూళ్లో గతేడాది ఒక్క స్టూడెంట్ మాత్రమే ఉన్న విషయం వెలుగులోకి రాగా అప్పటి కలెక్టర్ముజమ్మిల్ ఖాన్ రూ.6 లక్షలతో స్కూల్ను అందంగా తీర్చిదిద్దారు. ఒకే ఒక్క విద్యార్థిని అయిన నాలుగో తరగతి స్టూడెంట్ కీర్తనను ఆ స్కూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించి, స్కూల్ గోడలపై కీర్తన ఫోటోను ఆర్ట్ గా వేయించారు.
రూ.లక్షన్నరతో స్కూల్ ఆవరణలోకి కోతులు రాకుండా సోలార్ ఫెన్సింగ్, మరో లక్షన్నరతో ప్రత్యేకంగా డ్రాయింగ్ లతో స్కూల్ గోడలను అందంగా మార్చారు. ఇంకో రూ.2 లక్షలతో ఇతర సౌకర్యాలు అభివృద్ధి పనులు, రూ. లక్షతో ల్యాబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఆ స్కూల్ కు ఇద్దరు టీచర్లను కేటాయించారు. ఇలా మొత్తం 12 స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు గత కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ చొరవే కారణమైంది.
బడిబాట సక్సెస్..!
ఖమ్మం జిల్లాలో బడిబాట కార్యక్రమంలో సోమవారం వరకు 5212 మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్లలో జాయిన్ అయ్యారు. 1వ తరగతిలో జాయిన్ అయిన స్టూడెంట్స్2349 మంది కాగా, రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు 2863 మంది కొత్తగా చేరారు. వీరిలో 910 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి జాయిన్కాగా, 1953 మంది ఇతర ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చి చేరారు. ఈ నెల 20వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం కొనసాగుతుండడంతో, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.