ఏపీలో ఒక్క రోజులో 19,085 టెస్టులు.. 553 పాజిటివ్‌ కేసులు

ఏపీలో ఒక్క రోజులో 19,085 టెస్టులు.. 553 పాజిటివ్‌ కేసులు
  • 10,884కు చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 24 గంటల్లో 19,085 టెస్టులు పరీక్షించగా 553 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్‌ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 69 మంది కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, ఇతర రాష్ట్రాల వారి సంఖ్య 1730కి చేరింది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 10,884కి చేరింది. మృతుల సంఖ్య 136కి చేరినట్లు అధికారులు చెప్పారు. 118 మంది పేషంట్లు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 4,989కి చేరింది. 5,760 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,69,319 టెస్టులు చేసినట్లు అధికారులు చెప్పారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పు గోవావరి జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు