
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 5,653 మందికి కరోనా సోకగా…మరో 35 మంది చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ 73,625 కరోనా టెస్టులు చేశారు. 6,659 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 823 పాజిటివ్ కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 119 మందికి కరోనా సోకినట్టు తేలింది.
ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరులో ఐదుగురు చనిపోయారు. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరు, విశాఖలో ముగ్గురు చొప్పున కరోనాతో చనిపోయారు. అనంతపురం, గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. శ్రీకాకుళం, కడప జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 7,50,517 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,97,699 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 46,624 బాధితులు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.