ఏపీలో కొత్త‌గా 5795 కరోనా కేసులు న‌మోదు

ఏపీలో కొత్త‌గా 5795 కరోనా కేసులు న‌మోదు

ఏపీలో కొత్తగా 5,795 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,23,512కు చేరింది. గడిచిన‌ 24 గంటల్లో 33 మరణాలు సంభవించ‌గా.. ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,019కి చేరింది. ప్రస్తుతం 51,060 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,66,433 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక జిల్లాల వారీగా న‌మోదైన కేసుల్లో.. అనంతపురంలో 209,చిత్తూరులో970, తూర్పుగోదావరిలో 801, గుంటూరులో 441, కడపలో 434, కృష్ణాలో 482, కర్నూల్ లో 123, నెల్లూరులో 451,ప్రకాశంలో 580, శ్రీకాకుళంలో 142, విశాఖపట్టణంలో 303 విజయనగరంలో 163,పశ్చిమగోదావరిలో 696కేసులు నమోదయ్యాయి.