కామారెడ్డి డిపో నుంచి మేడారం జాతరకు 58 బస్సులు

 కామారెడ్డి డిపో నుంచి మేడారం జాతరకు 58 బస్సులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి డిపో నుంచి మేడారం జాతరకు 58 బస్సులు నడుపుతున్నట్లు డీఎం ఇందిరాదేవి తెలిపారు. సోమవారం నుంచి 24 వరకు ఈ బస్సులు వెళ్తాయన్నారు. జాతరకు బస్సులు వెళ్తున్నందున కామారెడ్డి డిపో పరిధిలోని గ్రామాలకు బస్సు సర్వీసులు తగ్గిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు, స్టూడెంట్స్, ఎంప్లాయీస్​సహకరించాలని డీఎం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇంటికే  మేడారం ప్రసాదం

టీఎస్​ఆర్టీసీ లాజిస్టిక్స్​ విభాగం ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ బంగారం ప్రసాదాన్ని ఇంటికే పంపిస్తామని కామారెడ్డి ఆర్టీసీ డీఎం ఇందిరాదేవి తెలిపారు.  మేడారం జాతర ప్రసాదం పాంప్లెంట్స్​ను ఆదివారం డీఎం రిలీజ్​ చేశారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ప్రసాదం ఇంటికే వస్తుందన్నారు. ప్రసాదం కోసం డిపో వద్ద సంప్రదించాలన్నారు. ఇన్​సైడర్​ యాప్​ ద్వారా కూడా బుక్​ చేసుకోవచ్చాన్నారు. అసిస్టెంట్​ మేనేజర్లు లింగమూర్తి,  వసుంధర, మార్కెటింగ్​ ఎగ్జిక్యూటివ్ ​రాజు పాల్గొన్నారు.