అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్, నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో జూలై 29న ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్‌కు 126 కి.మీ దూరంలో ఉన్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఉదయం 12:53 గంటలకు ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంపం 69 కి.మీ లోతులో 10.75 అక్షాంశం, 93.47 రేఖాంశం వద్ద ఇది సంభవించినట్టు NCS ట్వీట్ చేసింది.

అంతకు ముందు జూలై 28న సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాత్రి 6.09 గంటలకు ఉపరితలానికి 200 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దక్షిణాసియా ప్రాంతంలో ఇటీవలి కాలంలో తేలికపాటి భూకంపాలు సంభవించడం సర్వసాధారణంగా మారిపోయింది.

Earthquake of Magnitude:5.8, Occurred on 29-07-2023, 00:53:47 IST, Lat: 10.75 & Long: 93.47, Depth: 69 Km ,Location: Andaman Islands, for more information Download the BhooKamp App https://t.co/MKHCpo5N3Y @ndmaindia @Indiametdept @KirenRijiju @Dr_Mishra1966 @DDNewslive pic.twitter.com/WVe9MfROeU

— National Center for Seismology (@NCS_Earthquake) July 28, 2023