5 జి టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ 5జీ సేవల్ని అందిస్తోంది. రిలయన్స్ జియో కూడా త్వరలోనే ఈ సేవల్ని మొదలుపెట్టనుంది. ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా 5 జి సర్వీస్ అందుబాటు లోకి రానుంది. దాంతో ‘ఏ ఫోన్ అయితే బాగుంటుంది? ఎంత ధర పెట్టాలి?’ అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. రూ. 20 వేల లోపే కొన్ని కంపెనీలు బెస్ట్ 5జి ఫోన్లు అందిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి.
రెడ్ మి నోట్ 11 ప్లస్
6 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 695 5జీ చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. వివో టి1, వన్ప్లస్ నార్డ్ సిఇ2 లైట్, పోకో ఎక్స్4 ప్రో వంటి 5జి ఫోన్లలో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. ఇందులో 120 హెడ్జ్ అమొలెడ్ డిస్ ప్లే ఉంటుంది. 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్ ఉంది. ధర: రూ.19,999.
వన్ప్లస్ నార్డ్ సిఇ2 లైట్
64 ఎంపీ కెమెరా, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ. 19,999.
వివో టి1: 50 మెగాపిక్సెల్ కెమెరా, 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్.
ధర: రూ. 18,799.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జి
ఇది స్పాప్డ్రాగన్ 750 జి 5జి టెక్నాలజీతో పనిచేస్తుంది. 25 వాట్స్ ఛార్జర్తో తొందరగా ఛార్జింగ్ అవుతుంది.
ధర: రూ. 15,999.
మోటో జి 71
ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా,
60 హెడ్జ్ అమొలెడ్ డిస్ప్లే ఉంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్. 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ. ధర: రూ.16, 999.