అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి సీజ్

అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లి సీజ్

విజయవాడ: ఉల్లిపాయలకు కృత్రిమ కొరత సృష్టించి అమాంతం ధర పెంచాలని చూస్తూ అక్రమంగా నిల్వ ఉంచిన 603 క్వింటాళ్ల ఉల్లిపాయలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది ఉల్లి వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఇందులో 47మంది ఉల్లి వ్యాపారులు అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు. వారిలో కొందరు మార్కెటింగ్ ఫీజ్ ఎగ్గొట్టగా.. మరికొందరు అక్రమంగా ఆనియన్స్ నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 27 లక్షల విలువ చేసే 603 క్వింటాళ్ళ ఉల్లిపాయలను స్వాధీనం చేసుకున్నారు. అవకతవకలకు పాల్పడిన 47 మంది వ్యాపారుల్లో 37 మందికి జరిమానాలు విధించి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరో 10 మంది వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెలాఖరు వరకు హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ ఉంచుకోవాలని అధికారులు హెచ్చరించారు.