61 మంది అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు అరెస్ట్...రూ.కోటి బాధితులకు రీఫండ్

61 మంది అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లు అరెస్ట్...రూ.కోటి బాధితులకు రీఫండ్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: సిటీలో నమోదైన సైబర్​ కేసుల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 61 మంది నిందితులను పోలీసులు అరెస్ట్​చేశారు. సిటీ అడిషనల్​సీపీ విశ్వప్రసాద్​మంగళవారం సంబంధిత వివరాలు వెల్లడించారు. గత ఆగస్టులో పోలీసులకు 338  ఫిర్యాదులు రాగా.. 233 కేసులు నమోదు చేశారు. 

ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 13 మందిని, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్12 , సోషల్ మీడియా ఫ్రాడ్స్​లో  11, ఇన్సూరెన్స్ మోసాలు  8, డిజిటల్ అరెస్ట్ స్కాంలలో ముగ్గురు, ఇల్లీగల్​ ట్రాన్సాక్షన్స్​ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 132 కేసుల్లో కేవలం తమిళనాడుకు చెందిన 20 మంది,- కర్ణాటకకు చెందిన 16, -మహారాష్ట్ర 13,- గుజరాత్ 18, ఏపీ ఏడుగురు,  ఢిల్లీలో 13,  పశ్చిమ బెంగాల్ కు చెందిన 8 మంది ఉన్నారు. మిగతా కేసుల్లో యూపీ,- మధ్యప్రదేశ్, బిహార్, అసోం, ఉత్తరాఖండ్, రాజస్థాన్ కు చెందినవారు ఉన్నారు. అరెస్ట్​చేసినవారి వద్ద నుంచి రూ. కోటి రికవరీ చేసి, బాధితులకు రీఫండ్ చేసినట్లు అడిషనల్​సీపీ పేర్కొన్నారు.