ప్రజాభవన్​ ప్రజావాణికి 627 ఫిర్యాదులు

 ప్రజాభవన్​ ప్రజావాణికి  627 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 627 ఫిర్యాదులు అందాయి. వీటిలో హౌసింగ్ కు సంబంధించి 185, సోషల్​వెల్ఫేర్ ​విభాగానికి 108, రెవెన్యూకు 60, విద్యుత్ శాఖకు సంబంధించి 57, ప్రవాసీ ప్రజావాణికి 4, ఇతర విభాగాలకు చెందినవి 213 ఉన్నాయి.

రెండో దశ దళితబంధు విడుదల చేయాలంటూ కొందరు ప్రజాభవన్​ఆవరణలో బైఠాయించారు. ఘట్​కేసర్​ మండలం ఏదులాబాద్ గ్రామానికి చెందిన వేణుగోపాలచారి, రుక్మిణి దంపతులు ప్రజాభవన్​ ప్రజావాణికి థ్యాంక్స్​చెప్పారు. ఫిర్యాదు చేసిన మూడు నెలల్లో అధికారులు తమ భూమికి పట్టాదార్​పాస్​బుక్​వచ్చేలా చేశారని చెప్పారు.