
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. గత కొన్ని రోజులగా దాదాపు 65 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,486 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25,89,682కు చేరింది. ఒక్కరోజే 944 మంది చనిపోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 49,980 కి చేరింది.
నిన్నటి వరకు కరోనా నుంచి 18,62,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 6,77,444 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 7,46,608 కరోనా టెస్టులు చేశారు. దీంతో ఆగస్టు 15 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 2,93,09,703 కు చేరింది.
Spike of 63,489 cases and 944 deaths reported in India, in the last 24 hours.
The #COVID19 tally in the country rises to 25,89,682 including 6,77,444 active cases, 18,62,258 discharged & 49,980 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/55ZQrgdo0P
— ANI (@ANI) August 16, 2020