కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తెలంగాణ మోడల్ స్కూల్ గ్రౌండ్లో రెండు రోజులుగా కొనసాగుతున్న 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్19 గర్ల్స్ సెలక్షన్స్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. శనివారం రెండో రోజు సెమీఫైనల్స్లో మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల జట్లు పోటీ పడ్డాయి.
మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్రెడ్డి చీఫ్గెస్ట్గా హాజరై పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పోటీల్లో 160 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని ఉమ్మడి జిల్లా కాలేజ్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి, టోర్నమెంట్ఆర్గనైజర్ బి.బాబురావు, కన్వీనర్ డీఐఈవో కె.అంజయ్య తెలిపారు.
ప్రతిభ కనబర్చినవారిని రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేస్తామని, జనవరిలో నాగ్పూర్లో జరిగే పోటీల్లో వారు పాల్గొంటారని చెప్పారు. టోర్నీ అబ్జర్వర్గా పీడీ గంగామోహన్ వ్యవహరించారు. కార్యక్రమంలో మోడల్స్కూల్ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ పెద్దన్న, మంచిర్యాల జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకుబ్, పీఈటీలు, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.
