పంజాగుట్ట, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఎర్రగడ్డలో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన ఎం. ప్రవీణ్ కుమార్ శనివారం బైక్పై ఎర్రగడ్డ వైపు వెళ్తున్నాడు.
అక్కడి చెక్ పోస్టు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు ప్రవీణ్ బైక్ను ఆపారు. అతడి దగ్గరున్న బ్యాగ్ను చెక్ చేసి.. రూ.7 లక్షల 50 వేల క్యాష్గుర్తించారు. ఎలాంటి పేపర్లను అతడు చూపించకపోవడంతో ఆ మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు.