ఎర్రగడ్డలో రూ. 7.50 లక్షలు సీజ్

ఎర్రగడ్డలో రూ. 7.50 లక్షలు సీజ్

పంజాగుట్ట, వెలుగు : ఎన్నికల కోడ్ నేపథ్యంలో సిటీలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు ఎర్రగడ్డలో భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన ఎం. ప్రవీణ్ కుమార్ శనివారం బైక్​పై ఎర్రగడ్డ వైపు వెళ్తున్నాడు.

అక్కడి చెక్ పోస్టు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్న ఎస్​ఆర్​ నగర్​ పోలీసులు ప్రవీణ్ ​బైక్​ను ఆపారు. అతడి దగ్గరున్న బ్యాగ్​ను చెక్ చేసి.. రూ.7 లక్షల 50 వేల క్యాష్​గుర్తించారు. ఎలాంటి పేపర్లను అతడు చూపించకపోవడంతో ఆ మొత్తాన్ని పోలీసులు సీజ్ చేశారు.