![బేకరీ యజమానికి 7వేలు ఫైన్](https://static.v6velugu.com/uploads/2024/02/7-thousand-fine-for-bakery-owner_9NmY4gfSXj.jpg)
పాల్వంచ, వెలుగు : పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో ఓ బేకరీలో కాలం చెల్లిన కేకులను విక్రయిస్తున్నారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆఫీసర్లు సోమవారం బేకరీలో తనిఖీ చేశారు. బేకరీలో బూజుపట్టిన కేకులు ఉన్నట్లు మున్సిపల్ సిబ్బంది, ఎస్సై లక్ష్మణ్ రావు గుర్తించారు. వెంటనే దుకాణ యజమానికి రూ.7వేలు ఫైన్ వేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరిగితే బేకరీ సీజ్ చేస్తామని హెచ్చరించారు.