V6 News

సికింద్రాబాద్ ప్యారడైజ్ సింధి కాలనీలో 71.8 గ్రాముల ఓజీ కుష్‌‌ స్వాధీనం

సికింద్రాబాద్ ప్యారడైజ్ సింధి కాలనీలో 71.8 గ్రాముల ఓజీ కుష్‌‌ స్వాధీనం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ప్యారడైజ్​ సమీపంలోని సింధి కాలనీలో నిషేదిత మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఎస్టీఎఫ్​ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బంది దాడులు నిర్వహించి పలువురి వద్ద 42 గ్రాముల ఓజీ కుష్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. పది మందిపై కేసులు నమోదు చేసి కియా కారు, బైక్​, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. మరో ఘటనలో దూల్​పేటలో 29.8 గ్రాముల ఓజీ కుష్‌‌ను పట్టుకున్నారు. ఐదుగురిపై కేసులు బుక్ చేశారు.