
ఆఫ్ఘనిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం( ఆగస్టు 20) పశ్చిమ హెరాత్ ప్రావిన్స్ లో బస్సు, బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులోంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో 17 మంది పిల్లలు ఉన్నారు. మృతులంతా వలసదారులుగా గుర్తించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇదే అతిపెద్దది అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
د اطفايې مسؤلين په ډير ليږ وخت کي د حادثی ځای ته ورسيدل خو متاسفانه په ژغورلو ونه توانيدل pic.twitter.com/cj3RhQc25H
— Ahmadullah Muttaqi | احمدالله متقي (@Ahmadmuttaqi01) August 19, 2025
బస్సు ఢీకొన్న తర్వాత మంటల్లో చిక్కుకున్నట్లు ఓవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమీపంలోని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రమాదానికిగురైన బస్సు ఇరాన్ నుంచి బహిష్కరించబడిన ఆఫ్ఘన్లను తీసుకెళ్తున్నదని, సరిహద్దు దాటిన తర్వాత కాబూల్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు.