న్యూఢిల్లీ: దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజూ సగటున ఆరున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 7,230 మందికి పాజిటివ్ రాగా.. 176 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 65 వేలు దాటగా.. 4,710 మంది చనిపోయారు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గురువారం ఒక్కరోజే రెండున్నర వేలకుపైగా కొత్త కేసులు, 85 మరణాలు నమోదుకాగా.. మొత్తం కేసులు 60 వేలకు చేరువయ్యాయి. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలనూ కరోనా ఆగమాగం చేస్తోంది. వందల సంఖ్యలో కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఆరు రాష్ట్రాల్లో వందకుపైగా, 3 రాష్ట్రాల్లో 200కుపైగా, మరో ఆరు రాష్ట్రాల్లో 300కుపైగా కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకున్న కేరళలోనూ కొత్తగా 84 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.
భారత్ లో ఒక్క రోజే 7230 కరోనా కేసులు
- లేటెస్ట్
- May 29, 2020
లేటెస్ట్
- అలెర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్
- ముంబైలో ధనుష్, నాగార్జునల కుబేర సినిమా
- మోదీ, రాహుల్ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
- ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్
- గన్ మిస్ఫైర్.. డీఆర్జీ జవాన్ మృతి
- ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
- 4 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్టు
- కోల్కతాతో మ్యాచ్కూ ధవన్ దూరం
- తెలంగాణకు 29న నడ్డా.. 30న మోదీ
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా