
శంషాబాద్, వెలుగు: శానిటరీ ప్యాడ్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన ఓ ప్యాసింజర్ను శంషా బాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికా రులు అదుపులోకి తీసుకున్నారు. మస్కట్ నుంచి శంషాబాద్కు వచ్చిన విమానంలో ఒక మహిళ అనుమానాస్ప దంగా కనిపించింది.
ఆమెను మహిళా అధికారులు అదుపులోకి తీసుకుని సోదాలు చేశారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి శానిటరీ ప్యాడ్లో దాచి తరలిస్తున్నట్లు బయట పడింది. ఆమె వద్ద నుంచి 1,476 గ్రాముల గోల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగా రం విలువ రూ.77,90,534 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితురాలిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.