ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో మేనకోడలిపై  మామ ఘాతుకం
కటకటాల్లో నిందితుడు

రాజేంద్రనగర్, వెలుగు: ఏడేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం చేసిన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..ఖమ్మం జిల్లాకు చెందిన సందీప్(28) ఎన్ఐఆర్డీ దగ్గరలోని ఓ కాలనీలో  ఉంటూ ఎలక్ట్రిషీయన్ గా పనిచేస్తున్నాడు. సందీప్ ఇంటిపక్కనే తన అక్క ఇల్లు కూడా ఉంది. శుక్రవారం అక్క కూతురు(7) స్కూల్ కి వెళ్లలేదు. ఆ రోజు అక్క, బావ బయటికి వెళ్లడాన్ని సందీప్ గమనించాడు. ఇంట్లో అక్క కూతురు ఆడుకుంటోంది. సందీప్ అక్క ఇంటికి వెళ్లి..  డ్యాన్స్ చేద్దామంటూ ఆ చిన్నారిని టెర్రస్ పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. టెర్రస్ పై ఏడుస్తూ కూర్చున్న బాలికను ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. జరిగిన విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో చిన్నారి తండ్రి సందీప్ ను చితకబాది రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.