
‘మల్లేశం’ సినిమాతో దర్శక నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ రాచకొండ.. దీని తర్వాత మలయాళంలో ‘పాకా’ అనే థ్రిల్లర్ను నిర్మించారు. ఇప్పుడు హిందీలో ‘8 ఏఎమ్ మెట్రో’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ, కిశోర్ గంజితో కలిసి నిర్మిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, సయామి ఖేర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ పోస్టర్ను గుల్జార్ రిలీజ్ చేశారు. ఇందులో గుల్షన్, సయామి మెట్రో ట్రైన్లో ప్రయాణిస్తున్న పోస్టర్ ఆకట్టుకుంది. గుల్జార్ తన ఆరు కవితలను ఈ చిత్రానికి అందించారు.
ఈ సందర్భంగా రాజ్ మాట్లాడుతూ ‘మెట్రోలో అనుకోకుండా కలుసుకుని, ఒకరినొకరు తెలుసుకునే ఇద్దరు అపరిచితుల కథ ఇది. గుల్జార్ సాబ్ అందించిన సహకారానికి థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉంటాను’ అన్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండే కథలను సెలెక్ట్ చేసుకునే రాజ్ రాచకొండ ఈ సినిమాతో మరో ప్రయోగం చేయబోతున్నారని అర్ధమవుతోంది. మే 19న వరల్డ్వైడ్గా సినిమా రిలీజ్ కానుంది.