27 రీజనల్ పార్టీలకు 263 కోట్లు

 27 రీజనల్ పార్టీలకు 263 కోట్లు
  • 15 వేల కోట్ల  రహస్య విరాళాలు
  • 2020-21లో 27 రీజనల్ పార్టీలకు 263 కోట్లు: ఏడీఆర్ 

న్యూఢిల్లీ: దేశంలోని జాతీయ పార్టీలు పదిహేనేండ్లలో గుర్తుతెలియని దాతలనుంచి ఏటా యావరేజ్​గా రూ. వెయ్యి కోట్ల మేరకు విరాళాలు సేకరించాయి. 2004–05 నుంచి 2020–21 మధ్య 8 నేషనల్ పార్టీలు కలిపి మొత్తం రూ.15,077.97 కోట్లను సీక్రెట్ డొనేషన్ల రూపంలో సేకరించాయని ఈ మేరకు అసోసియేషన్​ డెమోక్రటిక్​ రిఫార్మ్స్​(ఏడీఆర్) వెల్లడించింది. ఒక్క 2020–21 ఏడాదికి.. 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలకు సీక్రెట్​గా సమకూరిన నిధులు రూ.690.67 కోట్లు అని ఏడీఆర్​తెలిపింది. జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, బీఎస్పీ, ఎన్సీలు ఉండగా.. ప్రాంతీయ పార్టీల్లో ఆప్, జేడీయూ, మజ్లిస్, టీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ తదితర పార్టీలు ఉన్నాయి.