రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 137 ప్రైవేటు కళాశాలల్లో 80 వేల 91సీట్లు భర్తీ చేస్తున్నట్లు పేర్కొంది.
16 యూనివర్సిటీ కాలేజీల్లో 4 వేల713 సీట్లు, రెండు ప్రైవేట్ వర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62 వేల 079 సీట్లను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
అత్యధికంగా సీఎస్ఈలో 15 వేల 897, ఈసీఈలో 9 వేల 734 సీట్లు ఉన్నట్లు తెలిపింది. ఎంసెట్కు సంబంధించి ఇంజినీరింగ్లో చేరాలనుకున్న విద్యార్థులు 2023 జూన్ 28 బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశాన్ని కలిపించింది.