ఏపీలో కొత్తగా 8,846 కేసులు..69 మంది మృతి

ఏపీలో కొత్తగా 8,846 కేసులు..69 మంది మృతి

అమరావతి : ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ట్రంలో కొత్తగా8,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,83,925కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో69మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో5,041మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో92,353 యాక్టివ్ కేసులు ఉండగా..4,86,531 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో47.31లక్షల కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది ఆరోగ్య శాఖ.

ఇవాళ్టి కరోనా రిపోర్ట్ వివరాలు