అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో 9,901 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపింది వైద్యారోగ్యశాఖ. ఒక్కరోజు వ్యవధిలో మరో 67 మంది చనిపోవడంతో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 4,846కు చేరిందని.. ప్రస్తుతం రాష్ట్రంలో 95,733 యాక్టివ్ కేసులున్నాయంది. ఇప్పటి వరకు 4,57,008 మంది కోలుకున్నారని.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,57,587కు పెరిగిందని చెప్పింది. శనివారం వరకు రాష్ట్రంలో 45,27,593 శాంపిల్స్ పరీక్షించారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఏపీలో ప్రాంతాలవారీగా కరోనా రిపోర్ట్