జనంపైకి దూసుకెళ్లిన జాగ్వార్ కారు.. తొమ్మిది మంది మృతి

జనంపైకి దూసుకెళ్లిన జాగ్వార్ కారు.. తొమ్మిది మంది మృతి

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్  ఫ్లై ఓవర్ దగ్గర అతి వేగంగా వచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది చనిపోగా మరో 10 కి గాయాలయ్యాయి

SG హైవేపై ఇస్కాన్ బ్రిడ్జి వద్ద తెల్లవారుజామున 1 గంటలకు థార్ (SUV) ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డు జవాన్ ట్రాఫిక్‌ను  కంట్రోల్ చేయడానికి  సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  దీంతో చాలా మంది అక్కడి చేరుకుని గుమిగూడారు.  అపుడే ఫ్లైఓవర్ పై వేగంగా వస్తున్న మరో జాగ్వార్ కారు జనాలపైకి దూసుకెళ్లింది. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు, నలుగురు వ్యక్తులు చికిత్స పొందుతూ మరణించారు. మరణించిన వారిలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డు జవాన్ ఉన్నారు. దాదాపు 10 మంది గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులలో చేర్చారు.

రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.