గాంధీ నుంచి నర్సింగ్ ఆఫీసర్లుగా 90 మంది ఎంపిక

గాంధీ నుంచి నర్సింగ్ ఆఫీసర్లుగా 90 మంది ఎంపిక

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న  ఔట్ సోర్సింగ్‌‌‌‌ నర్సులు ఇటీవల మెడికల్ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్ సంస్థ నిర్వహించిన ఎగ్జామ్‌‌‌‌లో ఉత్తీర్ణత చెంది, రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ నర్సింగ్‌‌‌‌ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం నర్సులు సంబరాలు నిర్వహించారు.  గాంధీ ఆసుపత్రిలో మొత్తం 260 మంది నర్సింగ్​ సిబ్బంది అవుట్​ సోర్సింగ్​ పద్ధతిలో పని చేస్తుండగా.. ఇందులో 90 మందికి పైగా నర్సింగ్​ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు.  తమను రెగ్యులర్​ చేయమని చాలా కాలంగా పోరాడుతున్న  తమకు అన్ని విధాల సహకరించి, పర్మినెంట్ జాబ్స్​ వచ్చేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్​ ప్రొఫెసర్​ ఎం.రాజారావు, నర్సింగ్​ సూపరింటెండెంట్​ మంగమ్మలకు నర్సులు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో  సబితారెడ్డి, లక్ష్మీ, ఇందిర, ధనలక్ష్మీ, సరళ, సుజాత తదితరులు పాల్గొన్నారు.