సీఎఫ్​ఓల మనసులో మాట... భారత్​ భవిష్యత్​ భేష్​!

 సీఎఫ్​ఓల మనసులో మాట... భారత్​ భవిష్యత్​ భేష్​!
  • వచ్చే ఏడాది కాలంలో రెవెన్యూ పెంచుకోవడంపై ఫోకస్ పెడతామని వెల్లడి
  • కొత్త తరం టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రయారిటీ ఇస్తున్న ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు: డెలాయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  ఇండియన్  కంపెనీల్లోని టాప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ ఎకానమీపై నమ్మకంగా ఉంది. మొత్తం ఆసియా– పసిఫిక్ దేశాల్లో  ఇండియన్ చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్సే (సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ) తమ కంపెనీల భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ధీమాగా ఉన్నారు.  డెలాయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసియా పసిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఏపీఏసీ)  వివిధ కంపెనీల చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్ ఆఫీసర్ల నుంచి అభిప్రాయాలు సేకరించి ఓ రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం, 71 శాతం మంది జపనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు  తమ దేశ ఆర్థిక వ్యవస్థపై న్యూట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. అదే ఆస్ట్రేలియన్ కంపెనీల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓల్లో 51 శాతం మంది, చైనీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎఫ్ఓల్లో 49 శాతం మంది ఈ అంశంపై న్యూట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు.  ఇండియన్ కంపెనీల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ కాన్ఫిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నారు. గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇండియా అనుసరించిన విధానాలు బాగున్నాయని చెప్పారు.

276 మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు..

ఆసియా– పసిఫిక్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై డెలాయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ రిపోర్ట్ చేసింది. మొత్తం 276  మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓల అభిప్రాయాలు సేకరించింది. గ్రోత్ మందగించడంతో పాటు పెరిగిన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గరిష్టాల్లోని వడ్డీ రేట్ల కారణంగా  సమీప కాలంలో బిజినెస్ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఎలా ఉంటుందనే అంశంపై సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తమ కంపెనీ భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారని డెలాయిట్ రిపోర్ట్ వెల్లడించింది. 85 శాతం మంది ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు సానుకూలంగా ఉన్నారంది. ఆసియా– పసిఫిక్ రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇతర దేశాల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలతో పోలిస్తే ఇండియన్ కంపెనీల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు తమ దేశ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. రెసిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (59 శాతం మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు), జియోపొలిటికల్ టెన్షన్లు (53 శాతం మంది), డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెక్ సెక్టార్లలోని సమస్యలు (27 శాతం మంది)..ఈ మూడు  ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంశాలు ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలను ఎక్కువగా ఇబ్బందిపెడుతున్నాయి. ఇంటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  ట్యాలెంట్ ఉన్నవారిని నిలుపుకోవడం (59 శాతం మంది), మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలు తలెత్తడం (41 శాతం మంది), డిజిటల్ బాట పట్టడం (35 శాతం మంది ) వంటి అంశాలు  ఇబ్బంది పెడుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీని పూర్తిగా వాడుకోవడంలో చాలా దూరంలో ఉన్నామని ఆసియా– పసిఫిక్ దేశాల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు భావిస్తున్నారు. డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం, కొంత మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటా అండ్ ఎనలిటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలపై ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు  కొత్త  తరం టెక్నాలజీపై  సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా
తీసుకుంటున్నారు.

ఖర్చులు తగ్గించుకోవడంపై..

సమస్యలను పరిష్కరించడంలో సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు భిన్నమైన విధానాలను అనుసరిస్తున్నారు. రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తగ్గించుకోవడానికి  టెక్నాలజీ ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచిదని 78 శాతం మంది ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు  భావిస్తున్నారు. అదే ఆస్ట్రేలియా, చైనా, జపాన్ దేశాల సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ పెడుతున్నారు. అంతేకాకుండా కార్యకలాపాలపై మానిటరింగ్ పెంచడం, పెట్టుబడి నిర్ణయాలను మానిటర్ చేయడం వంటి అంశాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు.  డెలాయిట్ రిపోర్ట్ ప్రకారం,  సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓల రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారుతోంది. టాప్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ బాధ్యతలు పెరిగాయని 86 శాతం మంది ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు పేర్కొన్నారు. తమ ఆర్గనైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలకమైన మార్పులను ముందుండి చూసుకుంటామని 84 శాతం మంది ఇండియన్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు వెల్లడించారు  రానున్న ఏడాది కాలంలో రెవెన్యూ పెంచడంపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడతామని 62 శాతం మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు  పేర్కొన్నారు. ఖర్చులు తగ్గిస్తామని 56 శాతం మంది, ఉత్పాదకతను మెరుగుపరుస్తామని 37 శాతం మంది అన్నారు. ఆస్ట్రేలియాలో  75 శాతం మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు ఖర్చులు తగ్గించడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 48 శాతం మంది సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను చేర్చుకోవడంపై, 70 శాతం మంది చైనీస్ సీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలు రెవెన్యూ పెంచుకోవడంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.