బీజేపీ నుంచి పోటీకి.. నాలుగో రోజు 333 దరఖాస్తులు

బీజేపీ నుంచి పోటీకి.. నాలుగో రోజు 333 దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4న ప్రారంభం కాగా.. నాలుగు రోజుల్లో మొత్తం 999 అప్లికేషన్లు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 333 వచ్చాయి. తాజాగా అప్లై చేసిన వాళ్లలో బోథ్ నుంచి మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వి.జైపాల్, ఎల్బీ నగర్ నుంచి కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి రోజున 182, రెండో రోజున 178, మూడో రోజున 306,  నాలుగో రోజున 333 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్లికేషన్లు ఇచ్చేందుకు వస్తున్న ఆశావహులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం సందడిగా మారింది.