పులి గోర్లు, మీసాలు, తలను ఎత్తుకెళ్లిన ముఠా అరెస్ట్

పులి గోర్లు, మీసాలు, తలను ఎత్తుకెళ్లిన ముఠా అరెస్ట్

పులిని చంపి... దాని గోర్లు, మీసాలు, తలను ఎత్తుకెళ్లిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మోసం గ్రామంలో ఈ ఘటన జరిగింది. డిసెంబర్ 25న మోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి కోసం విద్యుత్ తీగలు అమర్చారు. పులి ఉచ్చులో చిక్కుకొని చనిపోగానే దాని గోర్లు, మీసాలు, తలతీసుకొని.. మొండెం భాగాన్ని అక్కడే పాతి పెట్టి వెళ్లారు నిందితులు. అటవీశాఖ అధికారులు చూసి విచారణ చేయగా.. మొత్తం తొమ్మిది మంది ఈ వేటలో పాల్గొన్నట్లు నిర్ధారించారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు, తెలంగాణలోని కొమురంభీం జిల్లా దిగడ గ్రామానికి చెందిన మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 8 పులిగోర్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా గోర్లు, తల కోసం పోలీసులు గాలిస్తున్నారు.