
అరడజనుకుపైగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో ‘సాలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎనభై ఐదు శాతం పూర్తయింది. సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి మరో వారంలో అదిరిపోయే అప్డేట్ ఇవ్వనుందట టీమ్. అయితే ఆ అప్డేట్ ఏంటనే దానిపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
థియేట్రికల్ బిజినెస్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యిందని తెలుస్తోంది. దాదాపు ఐదు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్కి కూడా అధిక మొత్తంలో వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న విడుదలవుతోంది.
అలాగే ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమాపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవల సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యింది. ‘ప్రభాస్, మారుతి సినిమా బాగా రావాలని కోరుకుంటున్నాం’ అని నెటిజన్ కామెంట్ పెట్టగా, దానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ష్యూర్ షాట్’ అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ సినిమాపైనా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.