 
                                    అంబర్ పేట, వెలుగు: ఓ వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అంబర్పేట డీడీ కాలనీలో కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్లో మంత్రి శ్యామ్(56) అనే వ్యాపారి నివాసముంటున్నాడు. మొదటి భార్య మాధవిలతతో గొడవలు ఉండడంతో ఫాతిమా అనే మహిలను రెండో పెండ్లి చేసుకున్నాడు. యూఎస్ వెళ్లి వచ్చిన శ్యామ్ చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు.
ఇటీవల బంజారాహిల్స్ లో ల్యాండ్ అమ్మగా డబ్బులు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తాను ఉంటున్న రెసిడెన్సీకి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. శ్యామ్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండో భార్య ఫాతిమా అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదాలే కిడ్నాప్ కు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.

 
         
                     
                     
                    