చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి

చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి

నిర్మల్ జిల్లా నవాబ్ పేట గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల-నిర్మల్ ప్రధాన రహదారిపై  కారు అదుపుతప్పి చెట్టును డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో కారులోని గంగాధర్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. కారులోని మరో యువకుడు సాయి కుమార్‌కు తీవ్ర గాయాలవడంతో నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయికుమార్ కూడా మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.