పవ‌న్ క‌ల్యాణ్ పై కేసు.. నోటీసులిస్తారా.. అరెస్ట్ చేస్తారా..?

పవ‌న్ క‌ల్యాణ్ పై కేసు.. నోటీసులిస్తారా.. అరెస్ట్ చేస్తారా..?

విజయవాడ : ఏలూరు వారాహియాత్రలో వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. విజయవాడ 228 సచివాలయంలో పని చేస్తున్న అయోధ్యనగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పవన్ కల్యాణ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు బుధవారం (జులై 12న) FIR No: 405/ 2023 గా కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ పై సెక్షన్ 153, 153A, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 

కేసుల వివరాలు..

* సెక్షన్ 153 ప్రకారం పవన్ వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందంటూ కేసు 

* 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలకు అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద  కేసు

* 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినప్పటికీ.. కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద కేసు