చనిపోయి కనిపించిన పెద్ద పులి.. కుప్పం అడవుల్లో ఏం జరిగింది ?

చనిపోయి కనిపించిన పెద్ద పులి.. కుప్పం అడవుల్లో ఏం జరిగింది ?

ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం అటవీ ప్రాంతంలో చిరుత మృతి కలకలం రేపుతుంది .  కర్ణలపట్టు అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు చిరుత కళేబరాన్ని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామా జరిపి కేసు నమోదు చేశారు.చిరుత మృతదేహం నుండి దుర్వాసన పెద్దఎత్తున రావడంతో వారం ముందు మృతిచెందినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వేటగాళ్ల దాడిలో చిరుత మరణించిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా వి కోట మండలంలో మరో చిరుత గ్రామంలోని పశువులపై దాడి చేసింది . స్థానికులు అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయింది . చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.