
ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరికొంత గడువు ఇచ్చింది. 2023, సెప్టెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. వాస్తవానికి 2023, జూన్ 14వ తేదీ నాటికి చివరి గడువు అని ప్రకటించింది. గడువు ముగిశాక డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) మార్చి 15 నుంచి ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ రేపటి (2023, జూన్ 14)తో ముగియనుంది. గడువు ముగిశాక డబ్బులు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.
అప్డేట్ చేసుకోండిలా..
* https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
* ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు ‘ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్లోడ్ చేయాలి
* అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి
* రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్పై క్లిక్ చేయాలి.
* తర్వాత కనిపించే డ్రాప్డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
* ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
* 14 అంకెల ‘అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
* ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ 1947 నంబర్ను సంప్రదించవచ్చు.