నారాయణపేట, వెలుగు: వారసత్వంగా వచ్చిన భూమికి పాస్బుక్ రాలేదని.. తన భూమి తనకు దక్కుతుందో లేదోననే ఆందోళనతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన సిద్ధప్ప(40)కు ఏడెకరాల భూమి వారసత్వంగా వచ్చింది. 4 సంవత్సరాల క్రితం భూ ప్రక్షాళనలో భాగంగా ఆ భూమిని అధికారులు ఇతరులపై పట్టా చేశారు. ఇతరుల సర్వే నంబర్ ఉన్న ఎకరా భూమి ఇతని పేరిట చేశారు. అప్పటి నుంచి రైతు తన పాత బుక్లతో అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. జులై 7న జిల్లా కలెక్టర్కు సైతం దరఖాస్తు చేసుకున్నాడు. స్పందించిన కలెక్టర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేటికీ సమస్యను పరిష్కరించకపోవడంతో సిద్ధప్ప బుధవారం రాత్రి తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గురువారం జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం సిద్ధప్ప కుటుంబసభ్యులు, వ్యవసాయ సంఘం నాయకులు పాత బస్టాండ్ దగ్గర రాస్తారోకో చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలని, రైతు కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
పాస్బుక్ రాక భూమి దక్కదని రైతు ఆత్మహత్య
- తెలంగాణం
- July 30, 2021
లేటెస్ట్
- కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
- బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్
- ఘనంగా బండారు ఉత్సవం
- మా దారికి హామీ ఇస్తేనే ఓటు
- వీరభద్రేశ్వర ఆలయ హుండీ లెక్కింపు
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- IPL 2024: కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది..నో బాల్పై స్టార్ స్పోర్ట్స్ వివరణ
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్