నీ భూమి పోతే నన్నెట్లా సాదుతవ్​!

నీ భూమి పోతే నన్నెట్లా సాదుతవ్​!

ఆత్మకూరు (దామెర) వెలుగు: నాగ్ పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హై వే లో తన వ్యవసాయ భూమి పోతుండడం, దీన్ని కారణంగా చూపి భార్య వెళ్లిపోవడంతో హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండకు చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం..పసరగొండకు చెందిన నల్లెల్ల గౌరయ్య (35)కు ఎకరం వ్యవసాయ భూమి ఉంది. అందులో నుంచి 30 గుంటలు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే లో పోతోంది. గౌరయ్య కు ఇటీవలే పెండ్లయ్యింది. ‘హైవే లో భూమి పోతే ఎలా బతుకుతాం’ అని గౌరయ్య భార్య పుట్టింటికి పోయింది. దీంతో మనస్తాపానికి గురైన గౌరయ్య సోమవారం పత్తి చేను వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి కౌసల్య కంప్లయింట్​ మేరకు దామెర ఎస్సై హరిప్రియ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.