కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద కొడపగల్ మండలం జగన్నాథపల్లి శివారులోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని క్వాలిస్ ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొనడంతో క్వాలిస్ లో ప్రయాణిస్తున్న ఆరుగురు చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి.
క్వాలిస్ వాహనం బిచ్కుంద నుండి పిట్లం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో నలుగురు పెద్దవాళ్లుండగా, ఇద్దరు పిల్లలున్నారు.
ఇవి కూడా చదవండి
బాత్రూంలు బాగోలేవని బాలిక ఫిర్యాదు.. క్లీన్ చేసిన మంత్రి
ఐఏఎంసీకి హైదరాబాదే బెస్ట్ ప్లేస్: సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోవచ్చు.. పెళ్లి చేసుకోకూడదా?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి?