డ్యూయెట్ ప్రారంభం

డ్యూయెట్ ప్రారంభం

ఆనంద్ దేవరకొండ హీరోగా ‘డ్యూయెట్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. రితిక నాయక్ హీరోయిన్. మురుగదాస్ శిష్యుడు మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకుడు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి కో ప్రొడ్యూసర్. గురువారం అన్నపూర్ణ స్టూడియోస్‌‌లో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. హీరోలు విజయ్ దేవరకొండ, సత్య దేవ్, దర్శకులు హరీష్ శంకర్, చందూ మొండేటి, సాయి రాజేశ్, ఆనంద్ పేరెంట్స్ గోవర్థన్ దేవరకొండ, మాధవి అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. 

హీరో ఆనంద్ మాట్లాడుతూ ‘ఇది నాకొక స్పెషల్ మూవీ. తెలుగులో జ్ఞానవేల్ రాజా బిగ్ మూవీస్ చేయబోతున్నారు. అవన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.  మా సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీ  ఫీలయ్యా’ అని చెప్పాడు. ‘దర్శకుడిగా టాలీవుడ్‌‌కు పరిచయం అవడం సంతోషంగా ఉంది’ అన్నాడు మిథున్. కథ వినగానే మెస్మరైజ్ అయ్యానని చెప్పింది రితిక నాయక్. 

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘తమిళంలో సూర్య, కార్తితో సినిమాలు నిర్మించా. అలాగే ఇక్కడ విజయ్‌‌తో ‘నోటా’ తీసి, ఇప్పుడు ఆనంద్‌‌తో ‘డ్యూయెట్’ నిర్మిస్తున్నా. అట్లీ ఫస్ట్ మూవీ ‘రాజా రాణి’ చూసినప్పుడు ఎలా ఎమోషనల్ అయ్యానో.. ఈ కథ వినగానే అలాంటి ఫీల్ కలిగింది. జీవీ ప్రకాష్ ఇప్పటికే మా మూవీకి రెండు సాంగ్స్ ఇచ్చాడు. వారం రోజుల్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్  చేస్తాం’ అన్నారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘బేబి’ లాంటి సూపర్ హిట్ తర్వాత ఆనంద్ నటిస్తున్న మరో డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. డైరెక్టర్ మిథున్ ఫెంటాస్టిక్ స్టోరీ రాశాడు’ అని చెప్పారు.