- కంప్లయింట్ ఇచ్చిన వ్యక్తికి సిబ్బంది వింత సమాధానం
- గంటల పాటు తగలబడుతున్నా స్పందించలే..
- పని చేయని మై జీహెచ్ఎంసీ’ యాప్
హైదరాబాద్, వెలుగు : డంపింగ్చెత్తకు నిప్పు పెట్టారని, భారీ ఎత్తున వ్యాపిస్తున్న పొగతో జనాలంతా ఇబ్బందులు పడుతున్నారని జీహెచ్ఎంసీ హెల్ప్లైన్కు ఫోన్చేసిన ఓ వ్యక్తికి.. సిబ్బంది ఇచ్చిన సమాధానం విని బిత్తరపోవాల్సి వచ్చింది. బంజారాహిల్స్న్యూ ఎమ్మెల్యే కాలనీలోని యునిసెఫ్ ఆఫీ దగ్గరలో ఓ చెత్త డంపింగ్ యార్డు కొనసాగుతోంది. లోక ల్ గా సేకరించిన చెత్తను ఇక్కడ డంప్చేసి తర్వాత వెహికల్స్లో తరలిస్తుంటారు. డంప్చేసిన చెత్తకు మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఎగిసిపడిన మంటలు, పొగ, దుర్వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
స్థానికంగా ఉండే సతీశ్ వెంటనే జీహెచ్ఎంసీ హెల్ప్లైన్నంబర్ 040--–21111111 నంబర్కు కాల్చేసి విషయం చెప్పాడు. వివరాలు అన్నీ నమోదు చేసుకున్న సదరు సిబ్బంది 48 గంటల్లో సమస్య పరిష్కరిస్తామని సమాధానం ఇచ్చారు. ‘ఇది ఎమర్జెన్సీ. పొగతో ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పరిష్కరించాలి కదా. 48 గంటల వరకు బాధలు పడాల్సిందేనా’ అని సతీశ్ప్రశ్నించగా.. తామేమీ చేయలేమని, కంప్లయింట్రిజిస్టర్ అయినట్టు మెసేజ్వస్తుందని చెప్పి జీహెచ్ఎంసీ సిబ్బంది ఫోన్కట్చేశారు.
కంప్లయింట్ తీసుకోని యాప్
సిటీలో ఏదైనా సమస్య వస్తే కంప్లయింట్చేసేందుకు, ఇతర సేవలకు బల్దియా ‘మై జీహెచ్ఎంసీ యాప్’ రూపొందించింది. ఇందులో శానిటేషన్కు సంబంధించిన కాలమ్క్లిక్చేస్తే న్యూ కంప్లయింట్రిజిస్టర్ చేయొచ్చు. ఇక్కడ పేరు, సమస్య, ల్యాండ్మార్క్, ఇతర వివరాలు, ఫోన్నంబర్ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫొటోలు అప్లోడ్చేయాలి. తర్వాత సబ్మిట్కొడితే ఫిర్యాదు నమోదవుతుంది.
కానీ యాప్లో పైన సమస్యకు సంబంధించిన వివరాలన్నీ నమోదు చేసి సబ్మిట్కొడితే ‘ఫెయిల్డ్టు రిజిస్టర్ కంప్లయింట్’ అని వస్తోంది. ఎన్నిసార్లు చేసినా ఇదే రిపీటవుతోంది. ఎమర్జెన్సీ సమస్యలు పరిష్కరించేందుకు బల్దియా మరింత చొరవ చూపాలని సిటీ ప్రజలు కోరుతున్నారు.