మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు : తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మెడికల్ రిప్లను ‘సామాజిక శోధకులు’గా అభివర్ణించారు. శనివారం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మందుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని, మందులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసి రిప్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఫార్మా యాజమాన్యాలు కేవలం లాభాపేక్షత కాకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, పరిశ్రమల వల్ల కలిగే కాలుష్యం ప్రజల ప్రాణాలను బలిగొంటోందని హెచ్చరించారు.
