సెల్ ఫోన్ విషయంలో ఫ్రెండ్​తో గొడవ పడి సూసైడ్

సెల్ ఫోన్ విషయంలో ఫ్రెండ్​తో గొడవ పడి సూసైడ్

శేరిలింగంపల్లి, వెలుగు: సెల్​ఫోన్​ విషయంలో ఇంటి పక్క  ఉండే బాలుడితో గొడవ పడ్డ ఓ బాలిక విషయం తల్లికి తెలిస్తే కొడుతుందనే భయంతో సూసైడ్ చేసుకుంది.  మియాపూర్​ పీఎస్​ పరిధిలో ఈ ఘటన జరిగింది.  మియాపూర్​లోని న్యూ కాలనీలో ఉండే అనిల్, సంగీత దంపతుల కూతురు అనిత(14)  ఆరో తరగతి చదువుతోంది. శనివారం ఉదయం అనిల్​,సంగీత పనికి వెళ్లారు. అనిత మధ్యాహ్నం ఇంటి పక్కన ఉండే తన ఫ్రెండ్ ​అయిన బాలుడి సెల్​ఫోన్​లో ఆడుకుంటుంది. ఈ క్రమంలో సెల్​ఫోన్​ కిందపడి పగిలిపోయింది. దీంతో బాలుడు అనితని కొట్టాడు. ఈ విషయాన్ని అనిత  తన తల్లికి ఫోన్​ చేసి చెప్పింది. ఆ తర్వాత తల్లి వస్తే తతను కొడుతుందేమోననే భయంతో ఇంట్లో  ఫ్యాన్​కి ఉరేసుకుంది. స్థానికులు వెంటనే  సమీపంలోని ప్రైవేటు హాస్పిటల్​కి తరలించారు. ట్రీట్ మెంట్ తీసుకుంటూ  అనిత  సాయంత్రం చనిపోయింది.  కేసు ఫైల్ చేసినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు.